Wednesday, January 26, 2011

స్వాతంత్రం రాకుండా ఉండుంటే ఎలా ఉండేవాళ్ళం

మనకు స్వాతంత్రం వచ్చి అరవై మూడు సంవత్సరాలు పూర్తి అయ్యాయి.  ప్రస్తుతానికి సాధించింది ఎంతో మనందరకూ తెలుసు. "బ్రిటిష్ వాళ్ళ కభంద హస్తాలలో చిక్కుకొని, కార్చడానికి కన్నీరు ఇంకి పోయి, తన బిడ్డలా అవస్థలు చూడలేక, వాళ్ళకు విముక్తిని ప్రసాదించలేక,  ఆ విషపు కోరల మధ్య నలిగిపోయిన భారత మాత ద్రాస్య సృంఖలాలు తెంచిన స్వాతంత్రం"..  బాబోయి ... చాలు  ..బాబోయి.. చాలు .. ఈ తాండ్ర పాపారాయుడు టైపు డైలాగులకు ఇది సమయం కాదు కానీ,  అసలు స్వాతంత్రం రాలేదు అనుకొంటే మన దేశ పరిస్థితి ఎలా ఉండేది? ఒక సారి తమాషాగా చూద్దాం.
  • బ్రిటిష్ వాళ్ళు పెట్టిన  మనదేశం పేరు మారదు కానీ ఇండియా, యుకె లో భాగం అయ్యి ఉండేది. అంటే మనం లండన్ వెళ్లి ఆక్ఫోర్డ్,  Cambridge university లో చదవాలంటే  VISA అక్కర లేదు. 
  •  మనవాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు లండన్, యుకె వెళ్లి పనిచేసుకోవచ్చు. టికెట్ కొని వెళ్ళడమే అంతే.
  • ఒక్క యుకె మాత్రం కాదు, ఐరోపా ఖండం మొత్తం తిరిగి రావచ్చు. ఎక్కడైనా పని చేసుకోవచ్చు.
  • అమెరికా వెళ్ళాలంటే 90 డేస్ వీసా ఫ్రీ ఎంట్రీ. ఈజీ గ్రీన్ కార్డు ప్రాసెస్సింగ్.
  • మన కరెన్సీ పౌండ్ అయివుండేది. ఒక పౌండ్ అంటే దాదాపు 75 రూపాయలు, అమెరికన్  డాలర్ కంటే చాల ఎక్కువ అంటే అమెరికన్స్ కన్నా ధనవంతులం. 
  • రిజర్వేషన్ లు ఉండేవి కాదు, టాలెంట్ ఉన్నోడిదే ఉద్యోగం. 
  • ఆంధ్ర, తెలంగాణా అంటూ  ఉన్న టైం అంత తగలేసే ఉద్యమాలు ఉండేవికాదు. 
  • చీటికి మాటికి నిరాహార దీక్షలంటూ, ఓట్లకోసం రైతు జపం చేసి,  రోడ్డుల మీద, రైలు పట్టాల మీద పడుకొని, అదే ఒక ఉద్యమం అని మురిసిపోయేపనికిమాలిన రాజకీయ నాయకులు ఉండేవాళ్ళు కాదు. 
  •  విశ్వ విద్యాలయాల్లో చదువుకొంటున్న విద్యార్ధులే ప్రభుత్వ ఆస్తులు  ధ్వంసం చేస్తే,  ఆ ఆస్తులు రక్షించాల్సిన ప్రజా నాయకులే వాళ్ల మీద కేసులు ఎత్తివేయాలని సిగ్గులేని డిమాండులు చేసి ఉండేవాళ్ళు కాదు.
  • తెల్ల రేషన్ కార్డులు, పచ్చ రేషన్ కార్డులు, రెండు రూపాయల బియ్యం, రచ్చ బండ, గుదిబండ, లాంటి ఒట్లాకర్షణ గిమ్మిక్కులు ఉండేవి కావు. 
  • మన బస్సులు మనమే తగల బెట్టుకొని,  అదో గొప్ప ఘనకార్యం గా మురిసిపోయే మూర్ఖ ప్రజలను, నాయకులను చూసి గర్వపడే దౌర్భాగ్యపు స్థితిలో ఉండేవాళ్ళం కాదు. 
  • పాకిస్తాన్ నుండి వచ్చి, వందల మందిని పట్ట పగలు చంపిన వాడికి, సాక్షాలు సరిపోలేదంటూ ఇంకా రాచ మర్యాదలు చేస్తూ,  జైల్లో చికెన్ బిరియానిలు తినిపించే వాళ్ళం కాదు. 
  • మనకు తల్లి లాంటి  పార్లమెంటు మీద దాడి చేసి,  నాలుగురు  సైనికులను చంపినవాడిని,  మత ప్రాతిపదికన, ఓట్ల కారణంగా ఉరి తియ్యలేని పరిస్థితిలో ఉండేవాళ్ళం కాదు.
ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో, మరెన్నో.  స్వతత్రం వచ్చి మంచి జరిగిందా?  లేక పెనం మీద నుండి పొయ్యిలో పడిన సామెత లాగా,  క్రూరత్వం, మరెంతో తెలివైన పరిపాలన కలిగిన బ్రిటిష్ వాళ్ళనుండి,  మూర్ఖపు,  కుల-మత ప్రాతిపదికన పరిపాలించే మన భారతీయ రాజకీయ నాయకుల చేతుల్లో పడ్డామా  అనేది ఎప్పటికి అర్ధం కానీ ప్రశ్న.  అదిసరే కానీ ..UK సిటిజెన్ షిప్...,  europe టూర్ అంటే నాలాగే కొంచెం ఆశ పడ్డార?.. ఉష్.... తప్పండి బాబు..  జై భారత్ , జై జై భారత్.


1 comment:

  1. british palana lo aadavaari mana pranalaku rakshana undedhi kademo . swatantra bharatha desame bagundi anipisthundhi.

    ReplyDelete